NLR: 31 లక్షల మంది అక్కాచెల్లెమ్మలను ఇంటి యజమానులను చేసిన ఘనత వైసీపీదేనని పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత అన్నారు. నాడు జగనన్న రాజ్యంలో అమ్మ ఒడి, చేయూత వంటి పథకాలతో మహిళల ఇళ్లలో వెలుగులు నిండాయని, అయితే నేడు కూటమి పాలనలో మహిళల రక్షణ గాలికి వదిలేశారని విమర్శించారు. మాజీ సీఎం జగన్ మహిళా బిల్లుకు మద్దతు తెలిపారని గుర్తు చేశారు.