CTR: చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంను ఉదయం 6:20 గంటలకు మూసివేస్తున్నట్లు ఈవో వెంకట కిషోర్ తెలిపారు. సాయంత్రం 6:47కు గ్రహణం ఉండటంతో 9 గంటల ముందుగానే ఆలయం మూసివేస్తున్నారు. 4వ తేదీ ఉదయం నుంచి దర్శనాలు, సేవలు యథావిధిగా జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు.