CTR: పంచాయతీ పాలనలో కుప్పం బ్లాక్ ఉత్తమంగా నిలిచి జాతీయ అవార్డుకు ఎంపికైందని DPO సుధాకర్ రావు తెలిపారు. ఇటీవల కేంద్ర బృందం కుప్పం మండలం నాయనూరు గ్రామ పంచాయతీలో పర్యటిచింది. పారిశుద్ధ్యం, మౌలిక వసతులు, అభివృద్ధి వంటి అంశాలను పరిశీలించారు. సేవలు మెరుగ్గా ఉండడంతో జాతీయ పురస్కారానికి ఎంపిక చేశారని ఆయన తెలిపారు.