కడప నగరంలోని ముత్తురాస్పల్లి ZPHS హైస్కూల్ను ఎమ్మెల్యే మాధవి ఆకస్మికంగా సందర్శించి, మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి భోజన నాణ్యతపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. పాఠశాలలో మరుగుదొడ్ల పరిశుభ్రత లోపంపై అసహనం వ్యక్తం చేసి, వెంటనే శుభ్రత, తాగునీటి సదుపాయాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.