MDK: చిన్న శంకరంపేట మండలం జంగారాయలో ఇటీవల జరిగిన సంచలన దోపిడీ కేసును పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు బాధిత వృద్ధ దంపతులు సావిత్రి, అంజయ్యలను వారి నివాసంలో పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితుల్లో భయాందోళనలు తొలగిస్తూ, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.