KKD: ఏలేశ్వరం మండలం, యర్రవరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమగ్ర శిక్షా అభియాన్లో 4 లక్షల 50 వేల రూపాయలతో నిర్మించిన సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథమాటిక్స్ (STEM) ల్యాబ్ను ఎమ్మెల్యే సత్య ప్రభ మంగళవారం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను, విద్యార్థులలోని నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తుందన్నారు. ఇందులో కూటమి నాయకులు పాల్గొన్నారు.