BDK: భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ జూలూరుపాడు మండలం, నర్సాపురం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని 450 మంది విద్యార్థుల సౌకర్యాలను పరిశీలించిన ఆయన, వంటగదిలో కుళ్లిన కూరగాయలను చూసి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.