HNK: శాయంపేట రైతు వేదికలో బీఎల్ఓలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తహాసీల్దార్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ జాబితా ప్రక్షాళన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, త్వరలో చేపట్టబోయే హౌస్-టు-హౌస్ సర్వే ద్వారా డబుల్ (బోగస్) ఓటర్లను గుర్తించి తొలగించాలన్నారు.