MHBD: మరిపెడ మున్సిపాలిటీ మాకుల తండాలో బొడ్రాయి, బంగారు మైసమ్మ తల్లి విగ్రహా ప్రతిష్టాపన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతిష్ట వేడుకల్లో మాజీ గ్రంథాలయ ఛైర్మన్ నవీన్ రావు పాల్గొన్నారు. దేవతల అనుగ్రహంతో ప్రజలు కలకాలం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించారు.