RR: ఫరూఖ్ నగర్ మండలం దూసకల్ గ్రామంలోని 6వ వార్డులో రూ.5 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధే ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతిర్మయి అంజి, గ్రామస్తులు పాల్గొన్నారు.