విశాఖ ఎంజీఎం పార్కు బీచ్ వద్ద సముద్రం ఒడ్డుకు యువతి మృతదేహం కొట్టుకురావడంతో కలకలం రేగింది. స్థానికుల సమాచారం మేరకు.. 112 ద్వారా చేరుకున్న త్రీటౌన్ పోలీసులు మృతురాలిని పెదగంట్యాడ హెచ్బీ కాలనీకి చెందిన వంగిపురం వైష్ణవిగా గుర్తించారు. ఎస్సై సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.