KMR: బిక్కనూరు మండల కేంద్రానికి చెందిన లలిత, ఆమె కూతురు సోమవారం ద్విచక్ర వాహనంపై నిజాంపేట నుంచి వస్తుండగా రామాయంపేట వద్ద ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న మరో బైక్ వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తల్లి, కూతురు ఇద్దరికీ గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.