MNCL: జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణ పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.