KNR: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశి క్షణ మహా అభియాన్ శిక్షణలో భాగంగా బీజేపీ కరీంనగర్ ఈస్ట్, సెంట్రల్, సౌత్ జోన్ బీజేపీ శ్రేణులకు నిర్వహించిన శిక్షణ ఆదివారం ముగిసిందని తెలిపారు.