JN: నియోజకవర్గంలో ఎలాంటి అవినీతి, అక్రమాలు లేకుండా ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. లింగాల గణపురం మండలంలో అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు అవినీతి, అక్రమాలకు దూరంగా ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.