GNTR: చట్టసభల విలువైన సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా ప్రజాప్రతినిధులు ముందస్తు ప్రణాళికతో సభకు హాజరుకావాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. సోమవారం అసెంబ్లీలోని జనసేన శాసనసభా పక్ష కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు.