VZM: ప్రజారోగ్య రక్షణ కోసం నగరంలోని పలు హోటల్, రెస్టారెంట్ యాజమాన్యం, సిబ్బందికి ఆహార భద్రతపై గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు ఆహార భద్రత నియంత్రణాధికారిణి ఎస్. ఈశ్వరి తెలిపారు. శుభ్రత ప్రమాణాలు, ప్యాకింగ్లపై గుర్తుల ప్రాముఖ్యతపై ఆమె అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆహార భద్రత అధికారి వెంకటరమణ పాల్గొన్నారు.