AKP: నక్కపల్లి మండలంలో మే 1వ తేదీ నుంచి నిర్వహించే గృహ గణనలో పాల్గొనే సిబ్బందికి మూడు రోజులు పాటు నిర్వహించే శిక్షణ తరగతులను ఎంపీడీవో చిన్నకృష్ణ గురువారం ప్రారంభించారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం గృహ గణన చేయాలన్నారు. వచ్చే ఏడాది జనగణన కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు.