MNCL: మందమర్రి మండలం ఆదిల్ పేట్ గ్రామానికి చెందిన గోమాస సమ్మయ్య పై పిచ్చికుక్క దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చెయ్యగా ఈఎంటీ రాకేష్, పైలట్ సంపత్ వెంటనే ఘటన స్థలానికి చేరుకొని వైద్యుడి సూచన మేరకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం సమ్మయ్యను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.