NGKL: జిల్లాలోని భవన నిర్మాణ కార్మికులు తప్పనిసరిగా బీమా సౌకర్యం పొందాలని కార్మికాధికారి రాజ్ కుమార్ సూచించారు. మీ సేవలో రూ.110 చెల్లించి సభ్యత్వం తీసుకుంటే.. ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుని కుటుంబానికి రూ.10 లక్షలు, సాధారణ మరణానికి రూ.30 వేలు బీమా అందుతుందని తెలిపారు. కార్మికులు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.