SDPT: ప్రభుత్వం అందించే పథకాలు,సబ్సిడీలు అందాలంటే ప్రతి రైతు తప్పనిసరిగా ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్’ చేయించుకోవాలని కౌన్సిలర్ వనం రమేష్ సూచించారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట వార్డు కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆయన సోమవారం పరిశీలించారు. ఇంకా నమోదు చేసుకోని రైతులు వెంటనే స్పందించి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.