KNR: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును హౌస్ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ సోమవారం చొప్పదండిలో బీజేపీ నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొద్దిసేపు అక్కడ తోపులాట జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక పాలన సాగుతోందని నినాదాలు చేశారు.