ADB: బజార్హత్నూర్ మండలంలోని గంగాపూర్ గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను నేరేడిగొండలోని ఆయన నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 11న గ్రామంలో నిర్వహించనున్న అఖండ హరినామ సప్తహ, మూర్తి విగ్రహ ప్రతిష్టపన కార్యక్రమానికి రావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం అందజేశారు. ఈ మేరకు అనిల్ జాదవ్ అనుకూలంగా స్పందించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.