AP: రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానానికి మంత్రి నారాయణ ఆమోదం తెలిపారు. 2014-19 TDP హయాంలో అమరావతిని రాజధానిగా ఒప్పుకున్న జగన్.. ఆ తర్వాత మాట మార్చారని విమర్శించారు. తమ పాలనలో జగన్.. రాజధానిపై దుష్ప్రచారం చేసినా ప్రజలు తగ్గలేదని పేర్కొన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి పునర్నిర్మాణ పనులను వేగవంతం చేశామని గుర్తుచేశారు.