ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక TDP కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.