TPT: తిరుమల దర్శనార్థం జనసేన ఎమ్మెల్సీ హరి ప్రసాద్ వచ్చారు. ఆయనకు తిరుపతిలో జనసేన నాయకులు స్వాగతం పలికారు. ఆ పార్టీ మహిళా నేత అకేపాటి సుభాషిణి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరలయ్యాయి. ఇదే విషయమై ఆమెతో ఆయన మాట్లాడారు. వైసీపీపై ధైర్యంగా స్పందించినందుకు అభినందించారు. భష్యత్తులో ఘాటు వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. తమ అధినేత పవన్ ఇలాంటివి సహించరని హితవు పలికారు.