VKB: కమిషన్ ఏజెంట్లు, రైతులకు సరైన గిట్టుబాటు ధరలు కల్పిస్తూ న్యాయం చేయాలని మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిషన్ ఏజెంట్ల దుకాణాలను పరిశీలించారు. ఛైర్మన్ మాట్లాడుతూ రైతులకు కొనుగోలు చేసిన ధరలు వాటి కేజీల వివరాలను స్లిప్పులు వేసి అందించాలని ఏజెంట్లకు సూచించారు.