GNTR: పొన్నూరు పురపాలక సంఘం 2026-27 ఆర్థిక సంవత్సరానికి వివిధ మార్కెట్ల వేలం నోటీసు విడుదల చేసింది. మార్చి 28న ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో వేలం నిర్వహిస్తారు. కూరగాయలు, సండ్రీ, మాంసం, చేపల మార్కెట్, జంతు వధశాల వేలం జరుగుతుందని కమిషనర్ రమేష్ తెలిపారు. పాల్గొనేవారు అవసరమైన పత్రాలు సమర్పించి ఈఎండీ చెల్లించాలని ఆయన సూచించారు.