MNCL: నర్సరీలో పెంచుతున్న మొక్కలను ఎండిపోకుండా కాపాడాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య ఆదేశించారు. బుధవారం జన్నారం మండలంలోని జన్నారం, పోన్కల్ గ్రామాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాలలో ఉన్న నర్సరీలో పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న దృశ్య మొక్కలు ఎండిపోకుండా కాపాడాలని ఆయన ఆదేశించారు.