ప్రకాశం: పామూరు మండలం దోబగుంట్ల వద్ద వెలిగొండ ప్రాజెక్టు కాలువల పనులను వెంటనే పూర్తి చేయాలని సీపీఎం జిల్లా నాయకుడు సయ్యద్ అనీఫ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మోపాడు రిజర్వాయర్ను వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో చేర్చి రెండు టీఎంసీల నీటిని కేటాయించాలని కోరారు. దీంతో మండలంలోని రైతులకు సాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు.