ASR: బాలికల రక్తహీనతపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని జిల్లా వైద్య నిపుణులు గ్రేష్టు, కిషోర్కుమార్ తెలిపారు. డుంబ్రిగూడ కేజీబీవీలో బుధవారం 40 మంది విద్యార్థినులకు రక్తహీనత పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర బాల్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఈ పరీక్షలు చేపట్టినట్లు చెప్పారు. పాఠశాలలతో పాటు గ్రామాల్లో 15 ఏళ్ల బాలికల ఆరోగ్య పరీక్షలు చేస్తున్నామన్నారు.