NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఢిల్లీలోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను బుధవారం కలిశారు. పెన్నా నది కరకట్టల బలోపేతం, పినాకిని సత్యాగ్రహ ఆశ్రమ పరిరక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక అందచేశారు. 2011లో వచ్చిన వరదలు దాటికి ప్రజలు పడ్డ ఇబ్బందులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.