ADB: ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా లీడ్ బ్యాంకు అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం నాబార్డ్ రూపొందించిన 2026-27 ఆర్థిక సంవత్సరపు ‘పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్’ పుస్తకాన్ని ఆవిష్కరించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పీవో యువరాజ్ మర్మాట్, లీడ్ బ్యాంకు మేనేజర్ ఉత్పల్ కుమార్, రవీందర్ ఉన్నారు.