BHNG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం స్వామివారి నిత్య కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. ఆలయ మహామండపంలో స్వామి, అమ్మవార్లను నూతన వస్త్రాలు, పుష్పాలతో అలంకరించి, వేద మంత్రాల మధ్య వేడుక నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు సాగిన ఈ క్రతువులో భక్తులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, వడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.