VKB: ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి పరిష్కరించడమే తమ లక్ష్యమని వికారాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ గడ్డం అనన్య అన్నారు. సోమవారం పట్టణంలోని 13వ వార్డు ఆలంపల్లిలో అధికారులతో కలిసి ఆమె పర్యటించారు. కాలనీలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన నిధులు మంజూరు చేయించి, అన్ని వార్డులను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుతామని హామీ ఇచ్చారు.