టాటా సన్స్ బోర్డు సమావేశం కొనసాగుతోంది. గ్రూపులో నష్టాలు చవిచూస్తున్న కంపెనీల పనితీరు అంశంపై చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ కంపెనీలు విడివిడిగా తమ వ్యాపార స్థితి, భవిష్యత్ ప్రణాళికలపై ప్రజంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది. నష్టాల్లోని కంపెనీలపై చర్చించేందుకు గత వారం చివర్లో టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్, టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయల్ టాటా భేటీ అయినట్లు సమాచారం.