HYD: బీజేపీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు అడ్డుకున్నారు. ఆటోలో వచ్చిన ఆయనను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. 6 గ్యారెంటీల అమలు డిమాండ్తో బీజేపీ శ్రేణులు ఒక్కొక్కరుగా వెళ్లగా ఉద్రిక్తత ఏర్పడింది. రాంచందర్ రావుతో పాటు ముఖ్య నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.