KRNL: మార్చి 28, 29వ తేదీలలో ఆలూరులో జరుగనున్న 21వ ఏఐటీయూసీ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ దేవనకొండ మండల కార్యదర్శి నరసరావు పేర్కొన్నారు. కార్మికులందరూ సంఘటితంగా పోరాడి తమ హక్కులు సాధించుకునేందుకు గాను తలపెట్టిన ఈ మహాసభల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక సమస్యలపై చర్చలు జరిపి దిశానిర్దేశం చేస్తారన్నారు.