MLG: కొంతమంది కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి విమర్శించారు. ఈరోజు కన్నయ్యగూడెం మండల కేంద్రంలోని దేవాదుల ప్రాజెక్టు వద్ద నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్టు పనులను వచ్చే ఏడాది డిసెంబర్ నెలలోపు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందుబాటులో ఉంచుతామని మంత్రి హామీ ఇచ్చారు.