హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధరలు ఇవాళ పతనమయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ.5,000 తగ్గి, ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,60,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దాదాపు ఇవే ధరలు అమల్లో ఉన్నాయి. తగ్గిన వెండి ధర కొనుగోలుదారులకు కాస్త ఊరటనిచ్చింది. వెండి ఆభరణాలు లేదా కాయిన్స్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి సమయమని నిపుణులు చెబుతున్నారు.