SDPT: రంజాన్ పండుగకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం మున్సిపల్ ఛైర్ పర్సన్ దండి లక్ష్మి పరిశీలించారు. ముస్లిం సోదరుల ప్రార్థనలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈదుల్ ఫీతర్ నమాజ్ కోసం వేలాది మంది హాజరవుతారని, వారికి తాగునీరు, ఇతర వసతులు కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా వారి వెంట వైస్ ఛైర్ పర్సన్ చిత్తరి పద్మ, కౌన్సిలర్ సంపత్ తదితరులున్నరు.