పార్వతీపురం పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని నిర్వహించారు. డీఎస్పీ థామస్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడి, భారతీయులకు అండగా నిలిచిన మహనీయుడిగా ఆయనను స్మరించారు.