ATP: జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేయాలని, పాత దరఖాస్తుదారులు రసీదులు తీసుకురావాలని సూచించారు. పరిష్కారం కాని ఫిర్యాదుల కోసం 1100 కాల్ సెంటర్ లేదా ఆన్లైన్ వెబ్సైట్ సేవలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.