BHNG: భువనగిరి మండలం జమ్మాపురంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న మేరీ మాత విగ్రహాన్ని తొలగించి, కింద పడేసి అవమానపరిచిన నిందితులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి జహంగీర్ మంగళవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మతసామరస్యంతో అందరు కలిసిమెలిసి ఉంటున్న జిల్లాలో మతాల మధ్యన చిచ్చు పెట్టాలని చూస్తున్నారన్నారు.