W.G: నరసాపురం గడ్డపై జన్మించి, తెలుగు పత్రికా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రముఖ జర్నలిస్ట్, ఎడిటర్, కవి ఎం.సతీశ్ చంద్రకి ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారం లభించింది. సాహిత్య, జర్నలిజం రంగాల్లో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. ఆయన ఇప్పటి వరకు సుమారు 32 పుస్తకాలు రచించారు. ఈ సందర్బంగా పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.