అన్నమయ్య: రాయలసీమలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 179వ వర్ధంతి సందర్భంగా కలికిరిలో రాష్ట్ర రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పులి సత్యనారాయణరెడ్డి పాల్గొని, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దుష్ట పాలనకు ఎదిరించి పోరాడిన వీరుడని తెలిపారు.