నంద్యాలలో వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సోమవారం సూచించారు. వడదెబ్బ నివారణపై అవగాహన పోస్టర్లను ఆవిష్కరిస్తూ.. ఎక్కువగా నీరు, పళ్లరసాలు, మజ్జిగ తీసుకోవాలని, తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలని తెలిపారు.