WGL: వరంగల్-కాజీపేట స్టేషన్ మధ్య శాయంపేట రైల్వే గేట్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున సింహపురి ఎక్స్ప్రెస్ జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వద్ద బస్సు, సినిమా టికెట్లు లభించగా ఇతర గుర్తింపు ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.