PLD: మాచర్లకు చెందిన అధ్యాపకుడు కాకర్ల శ్రీనివాసరావుకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం శనివారం డాక్టరేట్ ప్రదానం చేసింది. ఉపాధి హామీ పథకం (MGNREGS) ద్వారా గ్రామీణ అభివృద్ధి, పేదరిక నిర్మూలనపై ఆయన చేసిన పరిశోధనలకు గాను ఈ గౌరవం దక్కింది. శ్రీనివాసరావు ప్రస్తుతం ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు.