VZM: ఆంద్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (APTF ) రాష్ట్ర అకడమిక్ కౌన్సిలర్గా బొబ్బిలికి చెందిన జె.సి.రాజు రెండవసారి ఎన్నికయ్యారు.ఈ మేరకు శనివారం ఈ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల తెలియజేశారు. ఈ సందర్భంగా జేసీ రాజు మాట్లాడుతూ.. సంఘ నిర్మాణానికి, అభివృద్ధికి, ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.